హైదరాబాద్, జూలై 16(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్)ను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్నది. ఈ నెల 15న డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని ఇదే తేదీ నుంచి ఉచిత వైద్య సేవలు ప్రారంభిస్తామని చెప్పిన ప్రభుత్వం ముందు రోజు సాయంత్రం వాయిదా వేసిన విషయం తెలిసిందే. అప్పటికే ప్రభుత్వం మే, జూన్ జీ తాల్లో నుంచి 1.5శాతాన్ని ప్రీమియం రూ పంలో కట్ చేసుకోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లలో ఆందోళన నెలకొన్నది. ఉద్యోగ సంఘా లు సైతం ప్రభుత్వం తీరుపై మండిపడ్డాయి. దీంతో ఎట్టకేలకు సర్కార్ కొత్త ఈహెచ్ఎస్ స్కీమ్ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చే సింది.
అలాగే ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ పా లకమండలిని పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇకపై పాలకమండలి ఈహెచ్ఎస్ పథకానికి సంబంధించి అన్ని అధికారులను వినియోగిస్తుందని తెలిపింది. పథకం అమలు, పరిపాలన, నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలు, పర్యవేక్షణ తదితర బాధ్యతలను బోర్డు నిర్వహించనున్నది. నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం, చట్టబద్ధత తప్పనిసరిగా పాటించాలని ట్రస్ట్ బోర్డుకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రభుత్వ ఉత్తర్వుల్లో దవాఖానలు, మార్గదర్శకాలు లేవు. ఏయే వ్యాధులకు వర్తిస్తుంద న్న స్పష్టత లేదు. బేసిక్ పే, బేసిక్ పెన్షన్ అని ప్రభుత్వం మెన్షన్ చేసింది.. మరి రిటైర్మెంట్ తర్వాత వీళ్లు ఏ కేటగిరిలోకి వస్తారో తేల్చలే దు. ఉద్యోగ విరమణ ఆరోగ్యభద్రత ఉన్న ట్టా? లేదా? అనే అంశంలో స్పష్టత లేదు.