హైదరాబాద్, జూలై 16(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఈగల్ ఫోర్స్, రాచకొండ నారోటిక్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో 237 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. దీని విలువ రూ.1.185 కోట్లుగా అంచనా వేశారు. అబిడ్స్లోని ఈగల్ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్ శివారు విజయవాడ-ముంబై జాతీయ రహదారిపై లారీ కంటెయినర్ను తనిఖీ చేయగా క్యాబిన్లో గంజాయిని దాచినట్టు గుర్తించారు. రాజేశ్కుమార్, అనిల్ రంగనాథ్ బిచారేను అదుపులోకి తీసుకున్నారు.