హుజూరాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం అంకుషాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆర్థికమంత్రి హరీశ్రావుతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలో గెల్లుకు గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. డప్పు చప్పుళ్లతో గెల్లుకు స్వాగతం పలికారు. హరీశ్రావుతో పాటు పార్టీ నాయకుల మీద పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ అంకుషాపూర్ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్ తో మాట్లాడి ప్రత్యేకంగా 100కోట్ల రూపాయలు తీసుకొని వస్తా నన్నారు. నియోజకవర్గానికి 5 వేల రెండు పడకల ఇల్లు తీసుకొని రావడంతో పాటు, సొంత జాగలో ఇల్లు కట్టుకొనే ప్రతి కుంటుంబానికి 5 లక్షల4 వేల రూపాయలు ఇప్పిస్తానన్నారు. అంకుషాపూర్ గ్రామంలో ఇల్లు లేని ప్రతి పేద కుటుంబా నికి ఇండ్లు కట్టించే బాధ్యత నాదేనని, నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చి ప్రజలకు ఉచిత వైద్యం అందించే విధంగా కృషి చేస్తానన్నారు.నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎమ్మెల్యే అరూరి రమేష్ ,జడ్పీటీసీ శ్రీరాంశ్యాం , ఎంపీపీ దోడ్డే మమత , సర్పంచ్ కడిపికొండ రాజిరెడ్డి , ఎంపీటీసీ వసుంధర , సింగిల్ విండో డైరెక్టర్ కడిపికొండ తిరుపతి రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ రాంబాబు, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కడిపికొండ సాంబశివరెడ్డి , జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి , టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొండల్ రెడ్డి, రాంరెడ్డి , వెంకట్ రెడ్డి , అనుబంధ సంఘాల నాయకులు, మహిళ సంఘాల నాయకులు, స్థానిక నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మడిపల్లి గ్రామంలో ..
హుజురాబాద్ నియోజకవర్గం, జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలోనూ మంత్రి తన్నీరు హరీష్ రావుతో కలిసి నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామస్తులు పార్టీ శ్రేణులకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎమ్మెల్యే అరూరి రమేష్ , కరీంనగర్ జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ , జడ్పీటీసీ శ్రీరాంశ్యాం , ఎంపీపీ ముగల పర్శరాములు, సర్పంచ్ రామిడి మల్లారెడ్డి , ఎంపీటీసీ నేరేళ్ల వసుంధర వెంకన్న , టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు వోల్లల చిరంజీవి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళ సంఘాల నాయకులు, స్థానిక నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు