పెద్దఅంబర్పేట, మే 6: భువనగిరి లోక్సభ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ తమ ప్లాట్లు కబ్జా చేశారంటూ యజమానులు ఆందోళనకు దిగారు. సోమవారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని పసుమాముల గ్రామ రెవెన్యూ పరిధిలో ప్లాట్ల యజమానులు ఆందోళన చేపట్టారు.
పసుమాములలోని 106/2 సర్వే నంబర్లో బూర నర్సయ్యగౌడ్ మరొకరితో కలిసి గతంలో కొంత భూమి కొనుగోలు చేశారని, దీని పక్కనే ఉన్న 87, 88 సర్వే నంబర్లలో 24 ప్లాట్లను కూడా వారు ఆధీనంలోకి తీసుకొన్నారని యజమా నులు ఆరోపించారు. దీనిపై కోర్టుకు వెళ్లడంతో తమను పిలిపించి మాట్లాడారని తెలిపారు. 12 ప్లాట్లను తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చారని, కానీ అప్పుడు.. ఇప్పుడూ అంటూ కాలం గడుపుతూ మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బూర నర్సయ్య గౌడ్ ఇప్పటికైనా తమకు ప్లాట్లు తిరిగిచ్చి మాట నిలబెట్టుకోవాలని కోరారు.