Hindustan Zinc | న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా అమ్మేస్తున్న మోదీ సర్కార్.. ఇక ప్రైవేట్ సంస్థల్లో ఉన్న ప్రభుత్వ వాటాను తగ్గించుకునే పనిలో పడింది. దీంట్లోభాగంగా వేదాంత గ్రూపునకు చెందిన హిందుస్థాన్ జింక్లో వాటాను విక్రయించడానికి ముహుర్తం ఖరారు చేసేయోచనలో ఉన్నది. హిందుస్థాన్ జింక్లో ఉన్న ప్రభుత్వ వాటా మొత్తాన్ని అమ్మేస్తామని గనులు శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు స్పష్టంచేశారు.
మార్కెట్ పరిస్థితులను బట్టి ఆఫర్ ఫర్ సేల్ రూట్లో మిగతా వాటాను విక్రయించాలనుకుంటున్నట్లు ఆయ న చెప్పారు. హిందుస్థాన్ జింక్లో కేంద్రానికి 29.54 శాతం వాటా ఉన్నది. మరోవైపు, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ను డీమెర్జింగ్ ప్రతిపాదనకు కేంద్ర గనులు మంత్రిత్వ శాఖ తిరస్కరించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్య లు చేయడం విశేషం.