రాజాపేట, మార్చి 20 : పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అలాంటి పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే దేశం ఆభివృద్ధి చెందుతుంది. పల్లెల అభివృద్ధి కోసం తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి స్పూర్తితో బొందుగుల గ్రామం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది. గ్రామ పంచాయతీ పాలకులు మౌలిక వసతులతో పాటు, సదుపాయాలను కల్పించడంలో జీపీ ముందుకు సాగుతుండడంతో ఆ గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తుంది పల్లె పగ్రతి పనులు పూర్తి పల్లె ప్రగతి పథకంలో భాగంగా పనుల్లో భాగంగా రూ. 12 లక్షలతో వైకుంఠధామం, 2.50 లక్షలతో డంపింగ్యార్డు, రూ. 2 లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ. 1.40 లక్షలతో గ్రామ వననర్సరీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా గ్రామంలో రూ. 30 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో పాటు రూ. ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి నిధులు రూ. 10 లక్షలతో కమ్యూనిటీహాల్ నిర్మాణం చేపట్టారు. మరో రూ. 5 లక్షలతో హమాలీ సంఘం భవనం, రూ. 22 లక్షలతో రైతు వేదిక భవనం పనులు పూర్తవడంతో వినియోగంలోకి వస్తున్నాయి. గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలు చేసి వినియోగించుకుంటున్నారు. రోడ్లకు ఇరువైపులా 5 వేల మొక్కలు నాటి సంరక్షించడంతో అవి ఏపుగా పెరిగి పచ్చదనంతో పరిఢరిల్లుతున్నాయి.
రాజాపేట మండలంలోని బొందుగులలో 4876 మంది జనాభా 3,750 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామానికి 14,15వ ఆర్థిక సంఘాల ద్వారా ప్రతి నెలా రూ. 3. 25 లక్షలు కేటాయించిన నిధులతో గ్రామ సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్రెడ్డి, పంచాయతీ పాలక వర్గ సభ్యులు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారు. గ్రామంలో పారిశుధ్య కార్మికులకు జీపీ సిబ్బందికి నెలనెలా జీతాలను అందిస్తూ పారిశుధ్య పనులను పక్కా ప్రణాళికతో చేపడుతున్నారు. సీజనల్ వ్యాధుల నివారణ కోసం దోమల మందు బ్లీచింగ్ ఫౌడర్ చల్లిస్తూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
పల్లె ప్రగతితోనే గ్రామంలో అనేక అభివృద్ధిని పనులను పూర్తి చేశాం. రాష్ట్రం ప్రభుత్వం నుంచి నెల నెలా వస్తున్న నిధులను గ్రామ అభివృద్ధికి వినియోగించుకుంటున్నాం. గ్రామంలో డంపింగ్యార్డు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాల పనులు పూర్తయ్యాయి. గ్రామానికి వచ్చే ప్రధాన రహాదారుల వెంట మొక్కలు నాటి సంరక్షించడంతో అవి ఏపుగా పెరిగి పచ్చగా కన్పిస్తున్నాయి.
– కంచర్ల శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో పల్లె రూపు రేఖలు మారిపోయాయి. గ్రామ అభివృద్ధిలో గ్రామస్తులంతా సహకారం అందిస్తున్నాం. గ్రామంలో పల్లె ప్రగతి పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి గ్రామ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు కేటాయించడం హర్షణీయం. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేసిన గ్రామ పంచాయతీ పాలకులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– అన్నబోయిన జగన్, గ్రామస్తుడు