మాచారెడ్డి, ఏప్రిల్ 24: వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మోసగించిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్కుమార్, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్తో కలిసి కామారెడ్డి జిల్లా మాచారెడ్డి, కామారెడ్డి మండలాల్లో పోచారం బుధవారం రోడ్ షో నిర్వహించి మాట్లాడారు.
పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తామంటున్న సీఎం.. ఇప్పటికీ రైతుబంధు పూర్తిగా ఇవ్వలేదని విమర్శించారు. ప్రజల బతుకులు మార్చే కేసీఆర్ నాయకత్వానికి మద్దతు తెలుపుతూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ‘పాంచ్ న్యాయ్’ పేరుతో ప్రజలకు పంగనామాలు పెట్టేందుకు యత్నిస్తున్నదని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేర్కొన్నారు.