సూర్యాపేట : కేసీఆర్(KCR) ఎన్నికల ప్రచారంపై(Election campaign) నిషేధం విధించడం ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కుట్రలో భాగమేనని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు. కేసీఆర్ ప్రచార నిషేధం, ఓటుకి నోటు కేసుపై ఎమ్మెల్యే స్పందించారు. మోదీ మత విద్వేషాలు, సీఎం రేవంత్ విద్వేష ప్రసంగాలు, ఫేక్ వీడియోలు ఈసీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ బస్సు యాత్రతో రేవంత్, మోదీకి వణుకుడు మొదలైంది.
ఆరు యాత్రలతోనే ఇద్దరి కాళ్ల కింద భూమి కంపిస్తుంద్నారు. ఇద్దరు కుట్ర చేసి కేసీఆర్ ప్రచారం ఆపేలా కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ వెంట ప్రజా ప్రభంజనం చూసి భయపడుతూ చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ని అడ్డుకోవడంతో ప్రచారానికి మించి రెట్టింపు ప్రజా మద్దతు వస్తుందన్నారు.
రేవంత్ ఢిల్లీ మూటల పై సమాచారం ఉంటే మోదీ ఎందుకు కేసులు పెట్టడంలేదని నిలదీశారు. రేవంత్ అవినీతి తెలిసినా మోదీ విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయి? కేసీఆర్ లేవనెత్తుతున్న ప్రజా సమస్యలను చర్చకు రానీయకుండా పక్కదారిపట్టించడం కోసమే డ్రామాలాడుతున్నరని వివమర్శించారు. ప్రజల్లో చర్చ మొదలైంది. ఎన్ని నిషేధాలు పెట్టినా బీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేదన్నారు.