Kavitha | ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ తీర్పును ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 6న తీర్పును వెల్లడించనున్నట్లు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా ప్రకటించారు. అదే రోజున ఈడీ, సీబీఐ కేసుల్లో ఒకే రోజు వేర్వేరుగా కవిత బెయిల్ పిటిషన్లపై తుది ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు ఇస్తామని జడ్జి తెలిపారు. ఇంతకు ముందు ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కే కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 7వ తేదీ వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మార్చి 15న ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.