BJP | న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన రోహిత్ వేముల కేసును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజకీయం చేశారని బీజేపీ మండిపడింది. ఈమేరకు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. ఈ కేసులో తెలంగాణ పోలీసులు క్లోజర్ రిపోర్టును కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో దళితులకు రాహుల్ గాంధీ క్షమాపణ చెబుతారా? అని ప్రశ్నించారు.
రోహిత్ మరణాన్ని రాహుల్ తన వికృత రాజకీయాల కోసం వినియోగించుకున్నారని దుయ్యబట్టారు. రోహిత్ ఎస్సీ వర్గానికి చెందినవారు కాదని, ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కాంగ్రెస్ పాలిత ప్రభుత్వమే క్లోజర్ రిపోర్టును దాఖలు చేసిందన్నారు.