తిరుమల: తిరుమలలో శ్రీవారి మెట్టు మార్గాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. గత నవంబర్ నెలలో భారీ వర్షాలతో మెట్ల మార్గం ధ్వంసమైంది. అప్పటి నుంచి ఈ మార్గంలో నడక ప్రయాణాన్ని అధికారులు నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పూర్వం ఉన్న రాతి బండలతోనే మెట్టు మరమ్మతులు చేపట్టామని వెల్లడించారు. భక్తులకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నడక ప్రయాణానికి అనుమతి ఇస్తామని ఆయన పేర్కొన్నారు. మెట్టు మార్గంలో భక్తులకు నిత్య ప్రసాదాలు అందజేస్తామని వివరించారు.
కాగా నిన్న శ్రీవారిని 69,603 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 30,434 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించు కున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.84 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.