Uber Cup | చెంగ్డూ: సీనియర్ల గైర్హాజరీలో యువ భారత షట్లర్లు అదరగొడుతున్నారు. చెంగ్డూ (చైనా) వేదికగా జరుగుతున్న ఉబర్ కప్లో ఆదివారం మన అమ్మాయిలు.. 4-1 తేడాతో సింగపూర్ను చిత్తుగా ఓడించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నారు. సింగపూర్తో పోరులో భాగంగా సింగిల్స్లో అష్మిత 15-21, 18-21 తేడాతో జియా మెన్ చేతిలో ఓడింది. కానీ ఆ తర్వాత రెండు సింగిల్స్, రెండు డబుల్స్ గేమ్స్లో భారత్ నెగ్గింది.
ప్రియా-శృతిల ద్వయం 21-15, 21-16 తేడాతో జియో ఎన్ హెంగ్-జిన్ యూ జియాలను చిత్తు చేసింది. సిమ్రన్-రితికా.. 21-8, 21-11 తేడాతో టింగ్ ఎల్సా-జన్ మిచెల్లీలను ఓడించింది. మిగిలిన రెండు సింగిల్స్ గేమ్స్లో ఇష్రాణి 21-13, 21-16 తేడాతో ఇన్సిరా ఖాన్ను చిత్తు చేయగా చివరి మ్యాచ్లో అన్మోల్.. 21-15, 21-13 తేడాతో లీ జిన్ను మట్టికరిపించింది.