హైదరాబాద్, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ) : ఇటీవల తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, తాజా పరిణామాలపై శుక్రవారం మంత్రి కొండా సురేఖ స్పందించారు. త్వరలోనే అన్ని విషయాలపై వివరంగా మాట్లాడుతానని ఆమె స్పష్టంచేశారు. తమ ఇంట్లో జరుగుతున్న ప్రత్యేక పూజా కార్యక్రమంలో బిజీగా ఉన్నానని, ఇప్పటికే చెప్పాల్సిన విషయాలన్నీ వివరణ లేఖలో స్పష్టం చేసినట్టు సురేఖ చెప్పారు. ఇంకా అదనంగా చెప్పడానికి ఏమీలేదని, ఇప్పటివరకు జరిగిన విషయాలపై త్వరలోనే మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలతో మాట్లాడుతానని పేర్కొన్నారు.