హైదరాబాద్, జనవరి 10 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పథకాలను కాపీ కొడుతూ, పార్లమెంటులో ప్రశంసిస్తుండగా .. రాష్ర్టానికి టూరిస్టుల్లా వచ్చే ఆ పార్టీ నేతలు ఫూలిష్గా మాట్లాడుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. రాష్ర్టానికే వచ్చే బీజేపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. అవగాహనా రాహిత్యంతో సీఎం కేసీఆర్ గురించి ఇష్టానుసారం మాట్లాడే సాహసం చేయొద్దని హితవు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లక్షా 32 వేల ఉద్యోగాలిచ్చినట్టు వివరించారు. బీజేపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.