Liquor | హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ నుంచి ప్రీమియం లిక్కర్ కర్ణాటకలోకి రాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎక్సైజ్ అధికారులను కర్ణాటక ఎక్సైజ్ అధికారులు కోరారు. గురువారం జరిగిన ఇంటర్ స్టేట్ జూమ్ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు రాష్ట్ర ఎక్సైజ్శాఖ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషీ తెలిపారు. సమావేశంలో ఇరు రాష్ర్టాలకు చెందిన ఎక్సైజ్ అధికారులు పలు ఒప్పందాలు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కర్ణాటకలో కల్లుపై నిషేధం ఉందని, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి కల్లు అక్రమ రవాణాపై దృష్టి సారించాలని కోరారు. ఏవోబీ నుంచి గంజాయి రవాణాను అడ్డుకునేందుకు అవసరమైతే జాయింట్ ఆపరేషన్లు చేయాలని తీర్మానించారు.