అమీర్పేట్: సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ సర్కార్ సంక్షేమ పథకాల అమల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. సనత్నగర్, అమీర్పేట్, బేగంపేట్ డివిజన్లకు చెందినే 16 మంది లబ్దిదారులకు 11 కళ్యాణలక్ష్మి, 5 షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారిలతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాలు పెరిగేలా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు.
ఒకరిపై ఆధారపడి జీవించాల్సిన పరిస్థితులు లేకుండా వితంతువులు, అనాథలు, వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు అందుతున్నాయని, నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు దేశంలోనే ఇప్పటివరకు ఎవరూ అమలు చేయని పథకమని, ఈ పథకం ద్వారా లబ్దిపొందుతున్న నిరుపేదలు ఆత్మగౌరవ జీవితాలను గడుపుతున్నారని తెలిపారు. అర్హులైన ప్రతిఒకరు ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కొలను బాల్రెడ్డితో పాటు ఖైరతాబాద్ , అమీర్పేట్ డిప్యూటీ తాసీల్దార్లు అశోక్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.