జమ్మికుంట రూరల్ : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే ఆగ్రగామి రాష్టంగా నిలుస్తోందని జమ్మికుంట రూరల్ ఇన్చార్జ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. మంగళవారం జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోరపల్లి గ్రామంలో ఉన్న పెండింగ్ పనులైన సీసీ రోడ్లకు, డ్రైనేజీ, కమ్యూనిటీ భవనాలకు కోటి ఇరవై మూడు లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. త్వరితగతిన ఆ పనులను కూడా పూర్తి చేసుకుంటామన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు గడపగడపకు వెళ్లి బొట్టు కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాళ్లకు వివరిస్తూ టీ అర్ ఎస్ అభ్యర్ది గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, గ్రామ సర్పంచ్ గిరివేని రమ-రాజయ్య, ఎంపీటీసీ కడవేరుగు మమత – మోహన్, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.