బీబీనగర్(భూదాన్పోచంపల్లి), ఆగస్టు 7 : చేనేత కార్మికుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పోచంపల్లిలో టై అండ్ డై చీరల ఉత్పత్తిదారుల సంఘంలో చేనేత కార్మికుల సన్మానోత్సవంలో పాల్గొన్నారు. పలువురు కార్మికులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేనేత వస్ర్తాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, నేతన్నలకు అండగా ఉండేందుకు రాష్ట్రంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి సోమవారం చేనేత వస్ర్తాలు వినియోగించాలని సూచించారని తెలిపారు.
చేనేత వస్ర్తాల వినియోగం పెరిగితే కార్మికులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు బీమా పథకం అమలు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్, ఎంపీపీ మాడుగుల ప్రభాకర్రెడ్డి, వైస్ చైర్మన్ బాతుక లింగస్వామి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు గుజ్జ సత్యం, నాయకులు కోట మల్లారెడ్డి, అంకం పాండు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సీత వెంకటేశం, కౌన్సిలర్లు కర్నాటి రవీందర్, గుండు మధు, పెద్దల చక్రపాణి, సామల మల్లారెడ్డి, కల్వకుంట్ల రమేశ్, శ్యాంసుందర్ పాల్గొన్నారు.