దేవరుప్పుల/ కొడకండ్ల, ఏప్రిల్ 10 : మహిళా సాధికారతే లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్లో, కొడకండ్ల మండలకేంద్రంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమాల్లో టైలరింగ్లో శిక్షణ పొందిన మహిళలకు ఆయన కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధి శాఖ పేదరిక నిర్మూలన సంస్థ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళల స్వయం ఉపాధే లక్ష్యంగా అనేక పథకాలు అమలు చేస్తున్నదన్నారు. డ్వాక్రా గ్రూపులతో ప్రారంభమైన మహిళా సంఘాల వ్యవస్థ నేడు మహోద్యమంగా మారి గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే స్థాయికి చేరాయన్నారు. మహిళా సంఘాలకు కోట్లాది రూపాయల రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకొస్తున్నట్లు తెలిపారు.
కుటుంబాల్లో మహిళల ప్రాధాన్యం పెరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళలకు కుట్టు మిషన్లో శిక్షణనిచ్చి, అనేక రకాలుగా ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు. ఇందులో పైలట్ ప్రాజెక్ట్గా రూ.5.1కోట్లతో పాలకుర్తి నియోజకవర్గంలోని మండలాలను ఎంపిక చేసి 3వేల మంది మహిళలకు మొదటి విడుత శిక్షణ పూర్తి చేసినట్లు తెలిపారు. వారికి కుట్టు మిషన్లు అందజేస్తున్నామన్నారు. శిక్షణ పూర్తయిన వారిలో అర్హులకు వరంగల్, కొడకండ్లలోని టెక్స్టైల్ పార్కుల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. పాలకుర్తిలో మొదటి విడుత విజయవంతగా ముగిసినందున రాష్ట్రమంతటా ఈ ప్రాజెక్టును విస్తరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, త్వరలో అన్ని జిల్లాల్లో కుట్టు శిక్షణ ప్రారంభమవుతుందని తెలిపారు. అనంతరం కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 200 మంది మహిళలకు సర్టిఫికెట్లు, కుట్టు మిషన్లు అందజేశారు. త్వరలో రెండ విడుత శిక్షణ తరగతులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ శివలింగయ్య, ఎంపీపీ బస్వ సావిత్రి, డీఆర్డీవో రాంరెడ్డి, జడ్పీ సీఈవో వసంత, ఆర్డీవో మధుమోహన్, డీపీవో రామాచారి, అడిషనల్ డీఆర్డీవో నూరోద్దీన్, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ కో ఆర్డినేటర్ కల్పన, వైస్ ఎంపీపీ కత్తుల విజయ్కుమార్, తహసీల్దార్ రవీందర్రెడ్డి, ఎంపీడీవో రవీందర్, చందన మండల సమాఖ్య అధ్యక్షురాలు నల్ల ఉమ, ఏపీఎం వెంకట్రెడ్డి, సర్పంచ్లు ఈదునూరి రమాదేవి, బిళ్ల అంజమ్మ, కవిత, సునీత, పోతిరెడ్డి బెత్లీనారెడ్డి, బండి స్నేహ, నాగంపల్లి బక్కమ్మ, రెడ్డిరాజుల రమేశ్, గేమానాయక్, ఎంపీటీసీలు తోటకూరి రేణుక, గుగులోత్ ఆశాజ్యోతి, మేడ కల్యాణి, నాయకులు సుందర్రాంరెడ్డి, తీగల దయాకర్, చింత రవి, భిక్షపతి, నర్సింహులు, తీగల సత్తయ్య, కృష్ణమూర్తి, కొడకండ్లలో ఆర్డీవో కృష్ణవేణి, ఏపీడీ నూరొద్దీన్, టీఎస్ఈజీసీ సభ్యుడు అందె యాకయ్య, కొడకండ్ల ఎంపీపీ ధరావత్ జ్యోతి, జడ్పీటీసీ సత్తెమ్మ, సర్పంచ్ మధుసూదన్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు రామోజీ, మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, ఎంపీటీసీ విజయలక్ష్మి, అమరేందర్రెడ్డి, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్ పాల్గొన్నారు.