Farmers | నాగర్కర్నూల్ : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. సాగుకు సరిపడా నీరు, కరెంట్ ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయి తీవ్ర నష్టాల పాలయ్యారు అన్నదాతలు. దీంతో రేవంత్ ప్రభుత్వంపై రైతులు గుర్రుగా ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఓటేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నామని రైతులు పేర్కొంటున్నారు.
నాగర్కర్నూల్లో ఓ రైతు మాట్లాడుతూ.. ఉన్న వడ్లను కొనేందుకు దిక్కు లేదు. ఇక బోనస్ ఎవడిస్తడు. వడ్లన్నీ కుప్ప పోస్తే అవి వర్షానికి తడిసిపోయాయి. వాటిని కొనేతోడే లేడు.. బోనస్ ఎక్కడుంది..? ఎంత ఎండిపోతే అంత నయమనిపిస్తుంది. రుణమాఫీ జోలికి పోతే కొట్టేటట్టు ఉన్నారు. రుణమాఫీ అడిగితే వాళ్లు చెప్పుతో కొట్టడం కాదు.. రేవంత్కు ఓటు వేసినందుకు మా చెప్పుతో మేం కొట్టుకోవాలి. రైతులను రేవంత్ మోసం చేసిండు. మనషులు చనిపోతే కనిపిస్తరు.. అదే దేవుళ్లు చనిపోతే కనిపించరు.. కాబట్టే రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్లు వేసి కాలం గడుపుతున్నారని ఆ రైతు పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డికి ఓటు వేసినందుకు చెప్పుతో కొట్టుకున్న నాగర్ కర్నూల్ రైతు
మనుషుల మీద ఒట్టు వేస్తే సచ్చిపోతరని రుణ మాఫీ చేస్తానని దేవుళ్ళ మీద ఒట్టు వేస్తుండు రేవంత్ రెడ్డి pic.twitter.com/NsSnLu7H8h
— Telugu Scribe (@TeluguScribe) April 27, 2024