న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇవాళ లోక్సభలో మాట్లాడారు. ధరల పెరుగుదల అంశంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో వంద శాతం ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు. ధరల పెరుగుదల వల్ల కామన్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యారన్నారు. గోధుమ, బియ్యం. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి తగ్గిందని, కానీ కానీ తెలంగాణలో వంద శాతం పెరిగిందన్నారు. ఎరువులపై మరింత భారం పెంచినట్లు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. వంటగ్యాస్ ధర వెయ్యి దాటిందని, పేదలు ఎలా బ్రతుకుతారని ఆయన అడిగారు.
ధరల పెరుగుదల వల్ల పేదలు మరింత పేదలుగా మారుతున్నారని అన్నారు. ధరలు పెరగలేదని ప్రభుత్వం సభలో చెప్పడం సరిగాలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా గోధుమ ఉత్పత్తి ఒక శాతం తగ్గిందని, దేశంలో ఉత్పత్తి మాత్రం బాగుందన్నారు. రైస్ కూడా ప్రపంచవ్యాప్తంగా 0.5 శాతం ఉత్పత్తి తగ్గిందన్నారు. కానీ దేశంలో బియ్యం ఉత్పత్తి వంద శాతం పెరిగిందని, తెలంగాణ రాష్ట్రం నుంచే ఆ పెంపు జరిగిందని ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు.
వంద శాతం రైస్ ఉత్పత్తి పెరిగినా, దాన్ని కేంద్ర ప్రభుత్వం కొనడంలేదన్నారు. రైతుల నుంచి బియ్యం కొనకపోవడం వల్లే, తెలంగాణ రైతులు చింతిస్తున్నారని నామా ఆరోపించారు. రైతులు దుఖ్కిస్తున్నారని అన్నారు. దేశంలో అన్నం పెట్టే శక్తి రైతులకు మాత్రమే ఉందన్నారు.