హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రానికి, దేశానికి ఎన్నటికైనా సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాలొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన బీజేపీ మండల కార్యదర్శి గడ్డం మోహన్రెడ్డి నేతృత్వంలో పలువురు నేతలు శనివారం మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ది సాకారమవుతున్నదని అన్నారు. దేశంలోనే అత్యంత ప్రతిభావంతుడైన మంత్రి, పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ఐటీ, పరిశ్రమలు, మున్సిపాలిటీ తదితర శాఖల్లో సరికొత్త సంసరణలతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు. నేడు అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే రోల్ మాడల్ అని తెలిపారు. కేసీఆర్ నాయకత్వం కావాలని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుకొంటున్నారనీ చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పూర్ణానందం, కమ్మర్పల్లి మారెట్ కమిటీ డైరెక్టర్ అంజిరెడ్డి, బోనగిరి రమేశ్, ఏనుగు నవీన్, తదితరులు పాల్గొన్నారు.