హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. మూడు గంటల పాటు కేబినెట్ భేటీ కొనసాగింది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేబినెట్ భేటీలో ఈ నెల 6 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు, పాలనాపరమైన అంశాలు, తెలంగాణ విలీన వజ్రోత్సవాల నిర్వహణ, విద్యుత్ బకాయిలు, ఇతర అంశాల్లో కేంద్రం వైఖరి, పోడు భూములు, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏపై చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. మరికాసేపట్లో టీఆర్ఎస్ ఎల్పీ ప్రారంభం కానుంది.