హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రమండలి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 9న నూతన శాసనసభ కొలువుదీరింది. కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం స్వీకారం చేశారు. దీంతో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై శుక్రవారం ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మంత్రి మండలి భేటీ అయింది.
మూడో శాసనసభ స్పీకర్గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఆయనతో స్పీకర్గా ప్రమాణం చేయించారు. అనంతరం బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్ సమక్షంలో ప్రమాణం చేశారు.