పుదుచ్చేరి, అక్టోబర్ 23: రిజిస్ట్రార్ను సస్పెండ్ చేస్తూ పుదుచ్చేరి టెక్నాలాజికల్ యూనివర్సిటీ (పీటీయూ) వైస్ చాన్స్లర్ ఇచ్చిన ఉత్తర్వులను లెఫ్ట్నెంట్ గవర్నర్ తమిళిసై రద్దు చేయించడాన్ని పుదుచ్చేరి మాజీ ఎంపీ ఎం రామదాస్ ఆదివారం ఖండించారు. ఎల్జీ జోక్యం తగదని పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ ఎకనామిక్స్ మాజీ విభాగాధిపతిగా పనిచేసిన రామదాస్ విమర్శించారు.
అధికార దుర్వినియోగం, నిధులు అవకతవకలతో పీటీయూ రిజిస్ట్రార్ జీ శివరాడ్జేను సస్పెండ్ చేస్తూ వీసీ ఎస్ మోహన్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. అయితే వర్సిటీ చాన్స్లర్గా ఉన్న తమిళిసై ఆదేశాలతో ఆ సస్పెన్సన్ ఆర్డర్ను రద్దు చేశారు. దీంతో ఎల్జీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని రామదాస్ విమర్శించారు.