చక్కెర పాకంలో తేలుతూ నోట్లో వేసుకోగానే కరిగిపోయే గులాబ్ జామూన్ను ఆహారప్రియులంతా ఇష్టపడతారు. అయితే గులాబ్ జామూన్తో బజ్జీలు కూడా చేస్తారని మీకు తెలుసా? నిజంగానే ఓ వ్యక్తి గులాబ్ జామూన్తో బజ్జీలు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. నెట్టింట వైరలవుతున్న ఓ వీడియోలో మిర్చి, ఆలూ, టమాట, ఉల్లి, వంకాయ.. ఇలా కూరగాయలతోనే కాకుండా యాపిల్, అనాస, పనస వంటి పండ్లతోనూ బజ్జీలు చేస్తున్న ఆ పాకశాస్త్రవేత్తను ‘బజ్జీ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని తెగ కొనియాడుతున్నారు నెటిజన్లు.
హైదరాబాద్ అంటే ఠక్కున గుర్తొచ్చేది.. హైదరాబాదీ బిర్యానీ. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకూ ప్రపంచవ్యాప్తంగా మన బిర్యానీకి లక్షలమంది అభిమానులు ఉన్నారు. ఆ ట్రెండ్ను వ్యాపార అవకాశంగా మలుచుకొని.. హైదరాబాద్ బిర్యానీకి సరికొత్త ఫ్లేవర్లను జోడించి మరీ అందిస్తున్నది..షేక్పేట్లోని అన్నాస్ బిర్యానీ హౌస్ (Anna’s Biryani House). తన తల్లి దగ్గర తెలుసుకున్న మెళకువలతో ఈ బిర్యానీ హౌస్ని ప్రారంభించారు రోషన్ చబ్రా. ఈ రెస్టారెంట్లో దాదాపు పది ఫ్లేవర్లలో బిర్యానీ లభిస్తుంది. దమ్ బిర్యానీతోపాటు చికెన్ లాలీపాప్, బటర్ చికెన్ బిర్యానీ, చికెన్- 65, చికెన్ పకోడి, బోన్లెస్ చికెన్ చంక్స్.. ఇలా ఇరవై ఐదు చికెన్ వెరైటీలనూ అందిస్తున్నారు రోషన్. ఈ రెస్టారెంట్లో బిర్యానీ టేస్ట్ చెయ్యాలంటే పర్సులో ఓ నూట డబ్భు రూపాయలు ఉంటే చాలు. మరిన్ని వెరైటీలు కావాలంటే ఇంకొంత మొత్తం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
♦ తర్బూజా.. ఎండవల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. ఛాతీలో మంట కలిగినప్పుడు తింటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
♦ మూత్రాశయంలోని మలినాలను బయటికి పంపడంలోనూ తర్బూజ సాయపడుతుంది. అధికబరువుతో బాధపడేవారికి ఈ పండు చక్కని ఔషధం. దీనిలో కొవ్వులు, కేలరీలు తక్కువ. దీనివల్ల ఆకలిగా ఉన్నప్పుడు తర్బూజాను తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది.
♦ దీనిలోని ఫైబర్ వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మలబద్ధకం ఇబ్బందిపెట్టదు. విటమిన్-ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ గుండె సంబంధ సమస్యలు రాకుండా కాపాడతాయి. మధుమేహాన్ని, క్యాన్సర్ కారకాలను కూడా నిరోధిస్తుంది.
కొన్నిసార్లు అర్ధరాత్రి ఆకలేస్తుంది. దీంతో ఆ సమయానికి ఏది అందుబాటులో ఉంటే అది తినేస్తారు. దీనివల్ల ఒబేసిటీ, అల్సర్స్ తదితర రుగ్మతల బారిన పడే అవకాశం ఉంది.
అర్ధరాత్రి ఫలహారంగా అరటి పండును మించిన ఆహారం లేదని సలహా ఇస్తున్నారు. దీనికో కారణం ఉంది. అరటిపండులో పుష్కలంగా ఉండే మెగ్నీషియం, పొటాషియం శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి. త్వరగా నిద్రపట్టేందుకు సహకరిస్తాయి. మేలుకున్న సమయంతో పోలిస్తే.. మనం నిద్రపోతున్నప్పుడే మెదడు రెండు రెట్లు పనిచేస్తుంది. కాబట్టి, పరిపూర్ణ నిద్ర చాలా ముఖ్యం. మధ్యలో మెలకువ రాకపోవడమే ఉత్తమం.
ఏం కావాలి?
ఓరియో బిస్కెట్స్: పది, కాచి చల్లార్చిన పాలు: రెండు కప్పులు, చక్కెర: అర కప్పు, చాక్లెట్ సిరప్: రెండు టీస్పూన్లు, ఐస్క్యూబ్స్: నాలుగు.
ఎలా చేయాలి?
మిక్సీ జార్లో రెండుగా విరిచిన ఓరియో బిస్కెట్స్, పాలు, చక్కెర, ఐస్ క్యూబ్స్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గ్లాస్లో చాక్లెట్ సిరప్ వేసి పైనుంచి ఓరియో మిశ్రమం పోసుకుంటే చల్లచల్లని ఓరియో మిల్క్షేక్ రెడీ. కావాలంటే పైనుంచి బిస్కెట్ ముక్కలు, చాక్లెట్ చిప్స్ వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.
నత్తగుల్లలు లొట్టలేసుకుంటూ తింటానంటున్న పూజా హెగ్డే.. బుట్ట బొమ్మ ఇష్టమైన ఫుడ్ ఏంటంటే..”
“ఇది మర్యాద రామన్న హోటల్.. ఇక్కడ ఎంత రెస్పెక్ట్ ఇస్తే అంత డిస్కౌంట్ !!”
“అమ్మో ! ఒక్క సమోసా 900 రూపాయలా? ఎక్కడో తెలుసా!!”
Matka Pizza | కుండ పిజ్జా ఎప్పుడైనా రుచి చూశారా?”