అమరావతి : విజయవాడ నగర శివారులోని వాంబే కాలనీలో ఇద్దరు వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. వాంబేకాలనీలో రెండో బ్లాక్లో నివాసముంటున్న కొండయ్య, మైసమ్మ అనే దంపతులు రెండురోజులుగా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు వారి ఇంటి కిటికీల నుంచి చూడగా విగతజీవులుగా ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దంపతుల మృతిపై ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.