MI vs SRH : ప్లే ఆఫ్స్ రేసులో లేని ముంబై ఇండియన్స్(Mumbai Indians) సొంత మైదానంలో గర్జించింది. తమపై రికార్డు స్కోర్ కొట్టిన సన్రైజర్స్ హైదరాబాద్ను చిత్తుగా ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. సోమవారం ఏకపక్షంగా సాగిన పోరులో టీ20 సంచలనం సూర్యకుమార్ యాదవ్(102 నాటౌట్) శతకంతో మెరవగా.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(37 నాటౌట్) మరోసారి సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. వీళ్లు నాలుగో వికెట్కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడంతో హైదరాబాద్పై ముంబై 7 వికెట్ల తేడాతో గెలిచింది. దాంతో, ఈ మ్యాచ్లో గెలిచి ఫ్లే ఆఫ్స్కి చేరాలనుకున్న కమిన్స్ బృందం కలలు కల్లలయ్యాయి.
వాంఖడేలో ముంబై ఇండియన్స్ ఆల్రౌండ్ షోతో హైదరాబాద్ను హడలెత్తించింది. బౌలర్ల కృషితో 173 పరుగులకే కట్టడి చేసిన ముంబై.. ఆ తర్వాత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(102 నాటౌట్) విధ్వంసంతో నాలుగో విజయం సాధించింది. ప్లే ఆఫ్స్ బెర్తు పోయిన వేళ గౌరవం కోసం ఆడుతున్న పాండ్యా సేనకు సూర్య, తిలక్ వర్మ(37 నాటౌట్) విక్టరీని గిఫ్ట్గా ఇచ్చారు. వీళ్లిద్దరూ నాలుగో వికెట్కు రన్స్ జోడించడంతో, ముంబై అలవోకగా గెలుపొందింది.
🎥 Range of shots from Suryakumar Yadav 💥
💯 partnership up for the 4th wicket now as Mumbai Indians continue to march on 👌
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvSRH | @mipaltan pic.twitter.com/WBxZpPGEQq
— IndianPremierLeague (@IPL) May 6, 2024
తొలుత ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ కొట్టింది చిన్న స్కోరే అయినా పేసర్లు ఆదిలోనే చెలరేగి నమ్మకం కలిగించారు. మార్కో జాన్సెన్ తన మొదటి ఓవర్లోనే ఇషాన్ కిషన్ (9) ను ఔట్ చేసి తొలి వికెట్ అందించగా.. కమిన్స్ తన వంతు అన్నట్టు రోహిత్ శర్మ(4)ను వెనక్కి పంపాడు. ఆ తర్వాత భువనేశ్వర్ సూపర్ బాల్తో తడబడుతున్న నమాన్ ధార్(0) ఇన్నింగ్స్కు తెరదించాడు. దాంతో, 31 పరుగులకే ముంబై మూడు వికెట్లు కోల్పోయింది. అంతే.. ఇక మ్యాచ్ మలుపుతిరిగినట్టే అనుకున్నారు.
తిలక్ వర్మ(37 నాటౌట్), సూర్య(102 నాటౌట్)
కానీ, సూర్యకుమార్ యాదవ్(102 నాటౌట్), తిలక్ వర్మ(37 నాటౌట్) లు ముంబైకి ఆపద్భాంధవులుగా మారారు. సెంచరీ భాగస్వామ్యంతో ముంబైని గెలపు వాకిట నిలిపారు. ఈ జోడీని వీడదీసేందుకు కమిన్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. నటరాజన్ బౌలింగ్లో సిక్సర్తో సూర్య సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో, ముంబై 7 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది.
ముంబై గడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు తేలిపోయారు. బౌలింగ్కు అనుకూలించిన వాంఖడే పిచ్పై దంచలేక డగౌట్కు క్యూ కట్టారు. టాపార్డర్లో ఓపెనర్ అభిషేక్ శర్మ(11) విఫలంకాగా మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్(48) ఫర్వాలేదనిపించాడు. పవర్ ప్లే తర్వాత హార్దిక్ పాండ్యా(3/31) , పీయూష్ చావ్లా((3/33))లు చివర్లో కెప్టెన్ కమిన్స్(35 నాటౌట్), నితీశ్ కుమార్(20), మార్కో జాన్సెన్(17)లు దంచారు. తుషార వేసిన 20వ ఓవర్లో కమిన్స్ సిక్సర్, ఫోర్ బాదాడు. దాంతో, హైదరాబాద్ 8 వికెట్ల నష్టానికి 173 రన్స్ చేయలగలిగింది.