అమరావతి : రాష్ట్ర ఎన్నికల అధికారి ఎంకె మీనా (MK Meena) శనివారం విశాఖలోని స్ట్రాంగ్రూమ్ లను పరిశీలించారు. ఈ నెల 13న జరిగిన పోలింగ్ అనంతరం విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఈవీఎం యంత్రాలను ఏయూలో భద్రపరిచారు. ఈ సందర్భంగా సీఈవో స్ట్రాంగ్రూం ( Strong room) )లను అధికారులతో కలిసి పరిశీలించి అక్కడ ఉన్న అధికారులకు, భధ్రతా సిబ్బందికి పలు సూచనలు చేశారు.
స్ట్రాంగ్రూంల వద్ద మూడంచెల భద్రతతో నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అన్ని చోట్లా సీసీ కెమెరాలు(CC Cameras) ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అనంతరం లాగ్బుక్లో సంతకం చేశారు. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూమ్లు ఉన్న ప్రాంతంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని ఆదేశించారు. అనంతరం విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లారు. ఆదివారం ఆయన విజయనగరం( Vijayanagaram) జిల్లాల్లో పర్యటించనున్నారు.