Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 17 ( నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 11 గంటలు దాటితే ఎండ దంచేస్తున్నది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35.6 డిగ్రీల నుంచి 37.7 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లా పిట్లంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 37.7 డిగ్రీలుగా రికార్డు అయ్యింది.
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ-గద్వాల, కరీంనగర్, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, వనపర్తి, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, పెద్దపల్లి, నారాయణ్పేట్, నల్లగొండ జిల్లాల్లో 37.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.