కోనరావుపేట/ సిరిసిల్ల : అనారోగ్యం బారిన పడి కుటుంబ సభ్యులకు భారం కావద్దని వృద్ధ దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నోముల భూమిరెడ్డి (80) నోముల లచ్చవ్వ (77) కలిసి జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమారులు, కూతరు ఉన్నారు.
ఈ క్రమంలో వృద్ధ దంపతులు వేరే ఉంటూ కలిసి నివసిస్తున్నారు. గత కొంత కాలంగా ఇద్దరు అనారోగ్యం బారిన పడి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దీంతో శనివారం రాత్రి ఇంట్లోని దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
మృతదేహాలను ఎస్ఐ రాజశేఖర్ పరిశీలించారు. మృతికి గల కారణాలను నమోదు చేసుకొని, మృతుల పెద్ద కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి : మంత్రులు
జొన్నకుప్ప దగ్ధం.. రూ.45వేల నష్టం
ఆలస్యంగా నిద్ర పోతున్నారా..? మెదడు పనితీరు తగ్గుతుందట..!
లారీని ఢీకొట్టిన కారు..వ్యక్తి మృతి