ఇల్లందకుంట: హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతోంది. ఇల్లందకుంట మండలం సీతంపేట గ్రామంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ తరఫున ఆ మండల ఇన్చార్జి, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, వేలేరు జడ్పీటీసీ చాడ సరిత, వేలేరు మండల టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు రుద్రోజు స్వరూప ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ బొట్టుపెట్టి ఓటు అడిగారు. ఉద్యమ బిడ్డ గెల్లు శ్రీనివాస్యాదవ్నే గెలిపించాలని కోరారు. వారి వెంట సర్పంచ్ మూడెత్తుల వెంకటస్వామి, ఎంపీటీసీ తెడ్ల ఓదెలు, గ్రామశాఖ అధ్యక్షుడు కుమార్, యూత్ నాయకుడు పాశం రాజు, వార్డుమెంబర్లు, పార్టీ మహిళలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.