మలక్పేట, ఏప్రిల్ 28: మూసారాంబాగ్లో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఓ బాలుడిని తీవ్రంగా గాయపరిచాయి. లక్ష్మీనగర్లోని శ్రీనిధి నిలయం అపార్ట్మెంట్ వాచ్మెన్గా పనిచేస్తున్న సాయికుమార్, అలేఖ్య దంపతుల కుమారుడు ఉజ్జల్కుమార్ గేట్ ముందు నిలబడి ఉండగా, ఒక్కసారిగా వచ్చిన కుక్కల గుంపు దాడి చేశాయి. బాలుడి అరుపులు విన్న కుటుంబసభ్యులు, అపార్ట్మెంట్ వాసులు వెంటనే వచ్చి కుక్కలను తరిమివేశారు. ఉజ్జల్ తల ముఖానికి, చేతులపై తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు దవాఖానలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.