కైరో: గత వారం రోజులుగా సుయెజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయి భారీ ట్రాఫిక్ జామ్కు కారణమైన ఎవర్ గివెన్ షిప్ సోమవారం కదిలింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 4.30 గంటలకు ఆ షిప్ తిరిగి నీటిపై తేలడం ప్రారంభించిందని ఇంచ్కేప్ షిప్పింగ్ సర్వీసెస్ తన ట్విటర్లో వెల్లడించింది. ఇక ఇప్పుడు అడ్డంగా ఇరుక్కున్న ఆ షిప్ను టగ్ బోట్ల సాయంతో మళ్లీ దారిలోకి తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. త్వరలోనే సుయెజ్ కాలువను తిరిగి తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ షిప్ వల్ల ఇప్పటికే కాలువలో అటుఇటూ కొన్ని వందలాది నౌకలు నిలిచిపోయాయి.
షిప్ ట్రాకింగ్ సర్వీస్ అయిన వెసెల్ఫైండర్ సుయెజ్ కాలువలోని ఎవర్ గివెన్ షిప్ స్టేటస్ను మార్చింది. ప్రస్తుతం ఆ కంటైనర్ షిప్ కదులుతున్నట్లుగా చెప్పింది. గత మంగళవారం 400 మీటర్ల పొడువున్న ఈ షిప్ సుయెజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. ఈదురు గాలుల కారణంగా ఈ షిప్ అడ్డం తిరిగింది. షిప్ తిరిగి పాక్షికంగా నీటిలో తేలినట్లు ఈజిప్ట్ అధికారులు తెలిపారు. సుయెజ్ కెనాల్ అథారిటీ దీనిని ధృవీకరించాల్సి ఉంది.
ఇవికూడా చదవండి..
అలస్కాలో కుప్పకూలిన హెలికాప్టర్..
ప్రపంచ వాణిజ్యానికి ట్రాఫిక్ జామ్
చిన్నారి పెళ్లికూతురు పెళ్లి పీటలెక్కిందా?
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్