Stock markets: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సూచీ సెన్సెక్స్ కేవలం 15 పాయింట్లు నష్టపోయి 73,142 వద్ద స్థిరపడింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) సూచీ నిఫ్టీ నాలుగు పాయింట్లు తగ్గి 22,212 వద్ద ముగిసింది.
బీఎస్ఈ 30 ఇండెక్స్లో బజాజ్ ఫిన్ సర్వ్, టైటాన్, ఎం అండ్ ఎం, నెస్లే ఇండియా, రిలయన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సూచీలు లాభాలు దక్కించుకున్నాయి.
పవర్ గ్రిడ్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ, ఎస్బీఐఎన్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, భారతీ ఎయిర్ టెల్, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ, హెచ్సీఎల్ టెక్ సూచీలు నష్టాలు మూటగట్టుకున్నాయి.