లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి దీటైన పోటీ ఇచ్చిన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) దాని మిత్రపక్షాలు 125 స్ధానాలకు పరిమితమయ్యాయి. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కర్హాల్ అసెంబ్లీ స్ధానం నుంచి ఆ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ రాంపూర్ స్ధానం నుంచి గెలుపొందారు.
అయితే వీరు ఎంపీలుగా కొనసాగుతుండటంతో లో్క్సభ స్ధానం వదులుకోవాలా లేక అసెంబ్లీ స్ధానం నుంచి వైదొలగాలా అనే మీమాంసలో ఉన్నారు. ఎస్పీ నేతలు అఖిలేష్ యాదవ్, ఆజంఖాన్ లోక్సభ సభ్యులుగానే కొనసాగే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వీరిద్దరూ వరుసగా ఆజంఘఢ్, రాంపూర్ లోక్సభ స్ధానాల నుంచి పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
లోక్సభలో ఎస్పీకి ఐదుగురు సభ్యులుండగా సభలో తమ సంఖ్యాబలం మరింత బలహీనపడకుండా చూసుకోవాలని ఆ పార్టీ యోచిస్తోంది. దీంతో వీరిద్దరూ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేసి లోక్సభ ఎంపీలుగా కొనసాగుతారని ఎస్పీ వర్గాలు వెల్లడించాయి. ఎస్పీ నేత శివపాల్ యాదవ్కు యూపీ అసెంబ్లీలో విపక్ష నేత బాధ్యతలు అప్పగిస్తారని కూడా భావిస్తున్నారు.