హుజూరాబాద్: టీఆర్ఎస్ పార్టీలో మంచి క్రేజ్ ఉన్న లీడర్లలో మంత్రి హరీశ్రావు ఒకరు. ఆయనకు ఎక్కడికి వెళ్లినా అభిమానులుంటారు. ప్రస్తుతం హరీశ్రావు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా, శనివారం హుజూరాబాద్లోని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. తిరిగి వెళ్తుండగా రోడ్డు పక్కన ఉన్న సిటీ ప్యాలెస్లో టీ తాగారు. ఆయన లోపలికి వెళ్లింది గమనించిన ఓ సోడా బండి నడిపే చిరు వ్యాపారి బట్టల షాపులోకి పరుగెత్తుకెళ్లాడు. శాలువా కొని తెచ్చాడు. హరీశ్రావు బయటికి వచ్చి వెళ్లిపోతుండగా.. హరీశన్నా.. హరీశన్నా.. అంటూ పిలిచి ఆపి మరీ శాలువా కప్పాడు. అభిమాన నేతను సత్కరించానన్న ఆనందం అతడి కళ్లలో కనిపించింది. కాగా, హరీశ్రావు అతడిని ఆప్యాయంగా పలకరించి, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ అపురూప దృశ్యం అక్కడున్నవారినందరినీ ఆకట్టుకున్నది.