లక్నో : గత ఏడాది కనిపించి కనువిందు చేసిన హిమాలయ పర్వతాలు.. ఈ ఏడాది కూడా దగ్గరయ్యాయి. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఢిల్లీ, యూపీ, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించడంతో కాలుష్యం చాలా తగ్గిపోయింది. ఫలితంగా ఎంతో దూరంలో ఉన్న హిమాలయాల అందాలు దగ్గరై ఆకట్టుకుంటున్నాయి. మంచుతో నిండిపోయి జిగేల్ మంటున్న హిమాలయాలను ఫొటోలు తీసిన పలువురు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
కొవిడ్ ప్రేరేపిత ఆంక్షల నేపథ్యంలో కాలుష్య స్థాయిలు తగ్గడంతో ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ పట్టణం నుంచి మంచుతో కప్పబడిన హిమాలయాల దృశ్యం కనువిందు చేసింది. సహరాన్పూర్ నుంచి హిమాలయాల శిఖరాలను ఫొటోగ్రాఫర్లు చక్కలు ఫొటోలు తీసి షేర్ చేస్తున్నారు. సహరాన్పూర్కు చెందిన ఔత్సాహిక ఫొటోగ్రాఫర్, ప్రభుత్వ ఉద్యోగి అయిన దుష్యంత్ కుమార్..ఈనెల 20 న పట్టణం నుంచి హిమాలయాల చిత్రాలను క్లిక్ చేసినట్లుగా చెప్పారు.
“సూర్యాస్తమయం సమయంలో హిమాలయాల గంగోత్రి, యమునోత్రి , బాండర్పంచ్ శ్రేణి ప్రకాశిస్తూ స్పష్టంగా కనిపించాయి. గత సంవత్సరం కూడా ఏప్రిల్ నుంచి ఈ శ్రేణి పర్వతాలు ఇక్కడ నుంచి కనిపించాయి. సహరాన్పూర్ నుంచి హిమాలయాలను చూడటం చాలా థ్రిల్లింగ్గా ఉన్నది ” అని దుష్యంత్ కుమార్ తెలిపారు.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్కు చెందిన రమేష్ పాండే డాక్టర్ వివేక్ బెనర్జీ క్లిక్ చేసిన చిత్రాలను ట్విట్టర్లో పోస్ట్ చేసి, “సహరాన్పూర్ నుంచి హిమాలయాలు మళ్లీ కనిపిస్తున్నాయి. ఎంతో స్పష్టంగా చూసేందుకు వీలు చిక్కింది” అని రాశారు.
ఐఎఎస్ అధికారి సంజయ్ కుమార్ కూడా మంత్రముగ్దులను చేసే ఫొటోలను పంచుకున్నారు. “సహరాన్పూర్ నగరం నుంచి 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని మంచుతో కప్పబడిన ఎగువ హిమాలయాల అద్భుతమైన దృశ్యం చూడటానికి రెండు కండ్లు చాలవు అని కామెంట్ చేశారు.
గాజాను పునర్నిర్మిస్తామని ఇజ్రాయెల్కు అమెరికా హామీ
అరటితో ఏమేం పోషకాలు అందుతాయంటే..?
ఆఫ్ఘనిస్తాన్లో విస్తరిస్తున్న తాలిబాన్.. మూడు జిల్లాలు స్వాధీనం
మయన్మార్లో అంతర్యుద్ధానికి అవకాశాలు : యూఎన్ హెచ్చరిక
విరాట్ సేనకు వెటరన్ క్రికెటర్ రిచర్డ్ హాడ్లీ ప్రశంసలు
ఒలింపియన్ సుశీల్ కుమార్ను సస్పెండ్ చేసిన రైల్వే
సీబీఐ డైరెక్టర్ ఎంపిక : జస్టిస్ రమణ అభ్యంతరంతో ఇద్దరి పేర్లు ఔట్..?!
అమరీందర్కు పక్కలో బళ్లెంలా సిద్దూ
నక్సల్స్ దాడిలో కాంగ్రెస్ నేతల మృతి.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..