జెరూసలెం : ఇరుదేశాల మధ్య బాంబుల దాడులతో దద్దరిల్లిన గాజాను పునర్నిర్మిస్తామని ఇజ్రాయెల్కు అమెరికా హామీ ఇచ్చింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహును అమెరికా విదేశాంగ కార్యదర్శి బ్లింకెన్ మంగళవారం కలిశారు. వీరు దాదాపు గంటన్నరకు పైగా సమావేశమయ్యారు. కాల్పుల విరమణ, గాజా స్ట్రిప్తో పాటు పలు అంశాలపై చర్చించారు. జెరూసలెంకు చేరుకున్న అమెరికా విదేశాంగ కార్యదర్శి బ్లింకెన్కు నెతన్యాహు సాదర స్వాగతం పలికారు.
ఇజ్రాయెల్-పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య కాల్పుల విరమణ ప్రయత్నంలో భాగంగా అమెరికా గాజాను పునర్నిర్మిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. హమాస్ అనే ఉగ్రవాద సంస్థ గాజా అభివృద్ధి పనుల నుంచి ఎటువంటి ప్రయోజనం పొందకుండా చూస్తామని కూడా ఆయన చెప్పారు. ఈ పనికి అమెరికా అంతర్జాతీయ మద్దతును సమీకరిస్తుందని తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కలిసిన తర్వాత బ్లింకెన్ ఈ ప్రకటన చేశారు.
అయితే, హమాస్ ఆక్రమిత గాజా ప్రాంతంలో అమెరికా అభివృద్ధి పనులు చేపట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని అని పలువురు అంటున్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య కాల్పుల విరమణ చేపట్టిన ఐదవ రోజున అమెరికా విదేశాంగ కార్యదర్శి బ్లింకెన్ ఇజ్రాయెల్లో పర్యటించారు. గాజీ స్ట్రిప్లో ఇప్పుడిప్పుడే శాంతి నెలకొంటున్నది. 11 రోజుల యుద్ధం తర్వాత అనేక ప్రధాన రహదారులకు మరమ్మతు పనులు చేపట్టారు. అలాగే, విద్యుత్ లైన్ పునరుద్ధరణ, నీటి సరఫరా మొదలైన పనులు పూర్తిచేస్తున్నారు.
అరటితో ఏమేం పోషకాలు అందుతాయంటే..?
ఆఫ్ఘనిస్తాన్లో విస్తరిస్తున్న తాలిబాన్.. మూడు జిల్లాలు స్వాధీనం
మయన్మార్లో అంతర్యుద్ధానికి అవకాశాలు : యూఎన్ హెచ్చరిక
విరాట్ సేనకు వెటరన్ క్రికెటర్ రిచర్డ్ హాడ్లీ ప్రశంసలు
ఒలింపియన్ సుశీల్ కుమార్ను సస్పెండ్ చేసిన రైల్వే
సీబీఐ డైరెక్టర్ ఎంపిక : జస్టిస్ రమణ అభ్యంతరంతో ఇద్దరి పేర్లు ఔట్..?!
అమరీందర్కు పక్కలో బళ్లెంలా సిద్దూ
నక్సల్స్ దాడిలో కాంగ్రెస్ నేతల మృతి.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..