ముంబై: మహారాష్ట్రలోని షిర్డీలో గల షిర్డీ సాయిబాబా ఆలయాన్ని మూసివేశారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రెండో వేవ్ ప్రభావం పెరిగిపోతుండటంతో సాయిబాబా ఆలయ దేవస్థానం పాలక మండలి శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ (ఎస్ ఎస్ ఎస్టీ) ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించినట్లు సోమవారం ప్రకటించింది.
సోమవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి ఈ నెలాఖరు వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపింది. సాయిబాబా ఆలయంతోపాటు, ప్రసాదాలయ, భక్త నివాస్ కూడా మూసి ఉంచుతారు. అయితే, రోజువారీ పూజా కార్యక్రమాలు మాత్రం యథాతథంగా సాగుతాయి.
ముందు జాగ్రత్త చర్యగా ఆలయాన్ని మూసివేసినా.. ఎస్ ఎస్ ఎస్టీ నిర్వహిస్తున్న కొవిడ్-19 దవాఖాన, ఇతర దవాఖానలు యధావిధిగా సేవలందిస్తాయని ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా లక్ష కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తం అవుతున్నాయి. కఠిన ఆంక్షలతో కూడిన నిబంధనల అమలు దిశగా చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూతోపాటు ఈ వారాంతం వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ భూమికి కరోనా
కళ్లు చెదిరే రీతిలో రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ లాంచ్.. వీడియో
తప్పు నాదే.. డీకాక్ది కాదు: ఫకర్ జమాన్
కొవిడ్తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో