కరోనా మహమ్మారి బాలీవుడ్ను వదలడం లేదు. తాజాగా మరో ఇద్దరు కరోనా బారిన పడ్డారు. నటుడు విక్కీ కౌశల్, నటి భూమి పడ్నేకర్లకు కరోనా సోకింది. ఈ విషయాన్ని వాళ్లే ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా కూడా తనకు కొవిడ్ పాజిటివ్గా తేలిందని, డాక్టర్ల సలహా మేరకు ఇంట్లో ఉంటూనే మందులు వాడుతున్నట్లు విక్కీ కౌశల్ తన ఇన్స్టాలో చెప్పాడు. తనో సన్నిహితంగా ఉన్న వాళ్లు టెస్టులు చేయించుకోవాలని కోరాడు.
అటు భూమి కూడా ఇన్స్టా ద్వారానే తనకు కొవిడ్ పాజిటివ్గా తేలిన విషయాన్ని చెప్పింది. ఇప్పటికైతే తనెకు స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తెలిపింది. ఆవిరి పట్టుకుంటూ, విటమిన్-సి, మంచి ఆహారం తీసుకుంటూ, హ్యాపీ మూడ్లో ఉంటూ కరోనాను ఎదుర్కొంటానని భూమి చెప్పింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దని సూచించింది.
ఇవికూడా చదవండి..
కర్ణాటక ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టులో ఊరట
మహారాష్ట్ర హోంమంత్రిపై సీబీఐ ప్రాథమిక విచారణ: హైకోర్టు
కళ్లు చెదిరే రీతిలో రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ లాంచ్.. వీడియో
తప్పు నాదే.. డీకాక్ది కాదు: ఫకర్ జమాన్
హాస్పిటల్లో చేరిన అక్షయ్ కుమార్
కొవిడ్తో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ సింగర్
ఇదేం క్రీడాస్ఫూర్తి.. ఫకర్ జమాన్ను డీకాక్ మోసం చేశాడా.. వీడియో