Kondagattu | జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజన్న ఆలయంలో అపశ్రుతి నెలకొంది. ఆలయం వద్ద వేసిన చలువ పందిరి కూలి 15 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాసిరకంగా ఏర్పాట్లు చేయడం వల్లే ఈ దుర్గటన జరిగిందని ఆరోపిస్తున్నారు.
హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హనుమాన్ మాల విరమణ కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు కూడా వేశారు. ఈ క్రమంలో నాసిరకంగా వేయడంతో చలువ పందిరి కూలిపోయిందని భక్తులు ఆరోపిస్తున్నారు.
కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో అపశృతి
ఆలయం వద్ద వేసిన చలువ పందిరి కూలి 15 మంది భక్తులకు తీవ్ర గాయాలు
హనుమాన్ విజయోత్సవ దినం కోసం తరలివచ్చిన భక్తులు
నాసిరకంగా ఏర్పాట్లు చేయడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని భక్తుల ఆగ్రహం pic.twitter.com/YXlK0R2k7O
— Telugu Scribe (@TeluguScribe) April 1, 2026