ముంబై, జనవరి 31: ఆర్థిక సర్వే దన్నుతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో దేశ వృద్ధిరేటు రెండంకెల స్థాయికి చేరుకోనున్నదని ఆర్థిక సర్వే అంచనాతో మదుపరులు ఎగబడి కొనుగోళ్ళు జరిపారు. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ మళ్లీ 58 వేల పాయింట్ల మైలురాయిని దాటింది. ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్ చివరకు 813.94 పాయింట్లు లేదా 1.42 శాతం లాభపడి 58,014.17 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 237.90 పాయింట్లు(1.39 శాతం) పెరిగి 17,339.85 వద్ద ముగిసింది.
3.33 లక్షల కోట్లు పెరిగిన సంపద
బడ్జెట్ ర్యాలీతో మదుపరుల సంపద రూ.3.33 లక్షల కోట్ల మేర పెరిగింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల కంపెనీల విలువ రూ.3,33,502.95 కోట్లు పెరిగి రూ.2,64,41,207.18 కోట్లకు చేరుకున్నది.