హైదరాబాద్ : శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పెద్ద ఎత్తున బంగారాన్ని పట్టుకున్నారు. ఎఫ్ జెడ్-8779 విమానం ద్వారా దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి 2.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వైర్లు కట్ చేసే పరికరాల్లో, మిక్సర్ గ్రైండర్ మోటార్లలో దాచి బంగారాన్ని తరలిస్తుండగా.. సోదాలు నిర్వహించి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఐదుగురు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
పట్టుకున్న బంగారం విలువ రూ.1.15 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నా అక్రమార్కులు మారడం లేదు. కొత్త పద్ధతులను అవలంభిస్తూ బంగారం రవాణా చేస్తూ అధికారులకు చిక్కుతున్నారు. అలాగే ఎఫ్జెడ్ 8776 ద్వారా దుబాయి వెళ్తున్న ఓ వ్యక్తి నుంచి 30వేల అమెరికన్ డాలర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కస్టమ్స్ ఇన్ సీఐఎస్ఎఫ్ సహకారంతో అక్రమంగా రవాణా చేస్తున్న రూ.21,48వేల విలువైన కరెన్సీని తరలిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు.