New Study | శారీరకంగా చురుకుగా ఉండే వారు మెరుగ్గా నిద్రిస్తారని నూతన అధ్యయనం వెల్లడించింది. వారానికి రెండు, మూడు సార్లు కనీసం గంట పాటు వ్యాయామం చేస్తే చాలు కంటి నిండా కునుకుతీసేందుకు సరిపోతుందని పరిశోధకులు తెలిపారు. శారీరకంగా చురుకుగా లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభాను ఇన్సోమ్నియా పట్టిపీడిస్తోందని, ఇదే నిద్ర లేమికి ప్రధాన కారణమని పరిశోధకులు చెబుతున్నారు.
ఇన్సోమ్నియాతో ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయని పేర్కొన్నారు. ఇక నిద్రలేమితో గుండె పోటు, స్ట్రోక్, ఊబకాయం, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. శారీరకంగా చురుకుగా ఉండేవారిలో నిద్రలేమి సమస్య ఉండదని పలు సర్వేలు వెల్లడించినా అయితే ఎంతమేర వ్యాయామం సరైన నిద్రకు అవసరమనే దానిపై తాజా అధ్యయనం దృష్టి సారించింది.
ఈ సర్వేలో భాగంగా ఐస్ల్యాండ్లోని రెజవిక్ యూనివర్సిటీ నేతృత్వంలో యూరప్కు చెందిన పరిశోధకులు 4,399 మందికి సంబంధించిన డేటాను విశ్లేషించారు. శారీరకంగా చురుకుగా ఉండే వారిలో ఇన్సోమ్నియా లక్షణాలతో పాటు నిద్రలేమి సమస్యలు తక్కువగా ఉండే అవకాశం ఉందని ఈ అధ్యయనం గుర్తించింది. పలు ఐరోపా దేశాలకు చెందిన వీరిని పదేండ్ల పాటు పరిశీలించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చారు.
Read More :
Game Changer | జరగండి జరగండి.. జాబిలమ్మ జాకెట్టేసుకొచ్చింది