న్యూఢిల్లీ: కోవిడ్ మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదికపై రాహుల్ గాంధీ స్పందించారు. ఇండియాలో కోవిడ్ వల్ల 47 లక్షల మంది మరణించినట్లు డబ్ల్యూహెచ్వో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ రిపోర్ట్ను ప్రభుత్వ వర్గాలు ఖండిస్తున్నాయి. దీనిపై ఇవాళ రాహుల్ తన ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వం పేర్కొన్నట్లు 4.8 లక్షల మంది కాదు అని, కోవిడ్ వల్ల ఇండియాలో 47 లక్షల మంది చనిపోయినట్లు రాహుల్ తెలిపారు. ఈ అంశంలో సైన్స్ అబద్ధం చెప్పదని, కానీ మోదీ సర్కార్ అవాస్తవాలు చెబుతున్నట్లు ఆయన ఆరోపించారు. కుటుంబసభ్యుల్ని కోల్పోయిన వారిని గౌరవించాలని, ఆ ఫ్యామిలీలకు నష్టపరిహారం కింద 4 లక్షలు ఇవ్వాలని తన ట్విట్టర్ రాహుల్ కోరారు.
47 lakh Indians died due to the Covid pandemic. NOT 4.8 lakh as claimed by the Govt.
Science doesn't LIE. Modi does.
Respect families who've lost loved ones. Support them with the mandated ₹4 lakh compensation. pic.twitter.com/p9y1VdVFsA
— Rahul Gandhi (@RahulGandhi) May 6, 2022