వివాదాస్పద సర్క్యులర్ ఉపసంహరణ
న్యూఢిల్లీ, జనవరి 29: మూడు నెలలకు మించి గర్భంతో ఉన్న అభ్యర్థులు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలిక అనర్హులుగా పేర్కొంటూ జారీచేసిన వివాదాస్పద సర్క్యులర్ను ఉపసంహరించుకుంటున్నట్టు ఎస్పీఐ వెల్లడించింది. సర్క్యులర్పై తీవ్ర విమర్శలు రావడం, ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీచేసిన నేపథ్యంలో ఎస్బీఐ వెనక్కి తగ్గింది. పాత నిబంధనల ప్రకారమే నియామకాలు ఉంటాయని తెలిపింది.