Loksabha Elections 2024 : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మగువల మంగళసూత్రాలకూ భద్రత ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. మోదీ వ్యాఖ్యలపై ఉత్తరాఖండ్లోని గర్వాల్ కాంగ్రెస్ అభ్యర్ధి గణేష్ గొదియల్ విస్మయం వ్యక్తం చేశారు.
గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా పదిగ్రాముల బంగారం ధర రూ. 30,000లోపు ఉండేదని, పదేండ్ల బీజేపీ పాలనలో పసిడి ధర ఏకంగా రూ. 78,000కు ఎగబాకిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో పసిడి ధరలు పట్టపగ్గాల్లేకుండా పెరుగుతూ మహిళలకు అందుబాటులో లేకుండా భారంగా మారితే మరోవైపు ప్రధాని అలా వ్యాఖ్యానించడం ఏమాత్రం సరైంది కాదని అన్నారు.
కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆస్తుల పున:పంపిణీ చేస్తామని చెబుతోందని, అదే జరిగితే మహిళల మెడలో మంగళసూత్రాలను సైతం తీసుకుని వాటిని చొరబాటుదార్లకు, అధిక సంతానం కలిగినవారికీ, ఉగ్రమూకలకూ అప్పగిస్తారని ప్రధాని ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Read More :