హైదరాబాద్, జనవరి 25 : గణతంత్ర వేడుకల్లో ప్లాస్టిక్ జాతీయ జెండాలు వినియోగించ కూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్లాస్టిక్ జెండాలను గణతంత్ర వేడుకల్లో వాడకూడదని స్పష్టంచేసింది. ఈ మేరకు అన్ని శాఖలు, అన్ని జిల్లాల కలెక్టర్లకు జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. గుడ్డలు, కాగితాలతో తయారుచేసిన జాతీయ జెండాలను మాత్రమే గణతంత్ర వేడుకల్లో వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. జాతీయ జెండాలను ఎక్కడ పడితే అక్కడ పడేయరాదని హెచ్చరించింది. జాతీయ జెండాకు అగౌరవం కలుగకుండా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించింది.