హోస్టన్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో భారత ప్యాడ్లర్ జ్ఞానేంద్ర సాతియాన్ ముందంజ వేశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో 37వ ర్యాంకర్ సాతియాన్ 4-0 (11-9, 11-9, 11-8, 11-6)తో వ్లాదిమిర్ సిడోరెంకో (రష్యాను)ను ఓడించాడు. ఆట ఆరంభం నుంచి సాతియాన్ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. మూడో రౌండ్లో అరుణ ఖాద్రీ (నైజిరియా)తో సాతియాన్ తలపడనున్నాడు. మిక్స్డ్ డబుల్స్లో శరత్ కమల్-అర్చనా కామత్ జోడీ 3-0తో సామి ఖైరోఫ్-కఠియా కెసకి (అల్గేరియా) జంటను ఓడించింది.